కుంకుమ్ భాగ్య సీరియల్‌ నటి మృతి..

-

కుంకుమ భాగ్య సీరియల్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ లో ముఖ్య పాత్రలో నటించిన నటి జరీనా ఖాన్ కు మంచి గుర్తింపు వచ్చింది. కుంకుమ భాగ్య సీరియల్ లో ఇందూ దాది పాత్రలో జరీనా ఖాన్ నటన గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరియల్‌ ద్వారా నటి జరీనా ఖాన్ (54) బాగా పాపులర్ అయ్యారు. ఆమె ఇటు సీరియల్స్‌తో పాటు కొన్ని చిత్రాలలో కూడా నటించింది. కానీ, ఇప్పుడు జరీనా ఖాన్ మన మధ్య లేరు. నటి జరీనా ఖాన్ గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తోంది. జరీనా మరణంతో నటులు షబీర్ అహ్లువాలియా, శ్రీతి జా, జరీనా ఖాన్ కు భావోద్వేగ వీడ్కోలు పలుకుతూ.. ఓ పిక్‌ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.ఇందు దాది మృతిపై బాలీవుడ్ సినీ, టీవీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

జరీనా తో ఉన్న తమ అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. జరీనా కుంకుమ్ భాగ్య సీరియల్‌తో పాటు ఇతర టీవీ షోలల్లోను నటించింది. వాటిలో ముఖ్యంగా యే రిష్టా క్యా కెహ్లతా హై ఒకటి. ఆమె మరణం పట్ల మరో టీవీ నటుడు అనురాగ్ శర్మ.. తన సంతాపాన్ని తెలియజేస్తూ.. జరీనా ఖాన్ మరణ వార్త నాకు షాకింగ్ గా ఉంది. ఈ వయస్సులో కూడా ఆమె ఎంతో స్ట్రాంగ్ గా ఉండేది. నేను ఆమె లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు.. అంటూ తన అనుబంధాన్ని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version