మానసిక క్షోభ అనుభవించా.. ‘మా’ కొత్త అధ్యక్షుడు నరేష్ బయటపెట్టిన నిజాలు..!

-

ఎప్పుడు లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు హోరా హోరీగా సాగాయి. ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్న శివాజి రాజాతో పాటుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నరేష్ ఈసారి పోటీలో నిలబడ్డారు. ‘మా’ అధ్యక్షుడిగా శివాజి రాజా మంచి పనులు చేసినా ఈసారి మార్పు కోసం నరేష్ ను గెలిపించారు. నరేష్ ప్యానెల్ లో జీవిత, రాజశేఖర్, శివ బాలాజి గెలవడం జరిగింది.

వైస్ ప్రెసిడెంట్ గా స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడిన హేమ విజయం సాధించారు. ఆదివారం రాత్రి రెండున్నర గంటలకు ‘మా’ ఫలితాలు వెళ్లడించారు. గెలిచిన తర్వాత నరేష్ మీడియాతో మాట్లాడారు. తాను చేసిన మంచి పనులే తనని గెలిపించాయని అన్నారు. తనని నమ్మి గెలిపించిన అందరికి కృతజ్ఞతలని చెప్పిన నరేష్ ‘మా’ కోసం మేమంతా కలిసి ఊడిగం చేస్తామని అన్నారు.

గెలిచినవారు.. ఓడిన వారు అందరిని ‘మా’ ఆహ్వానిస్తుంది.. మా అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకుంటుందని అన్నారు. ఇక శివాజి రాజా తన మీద లేనిపోని వ్యాఖ్యలు చేయడం తనని మానసిక క్షోభకి గురి చేసిందని అన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా తాను పనికిరానని.. కనీసం తనకి 50 ఓట్లు కూడా రావని శివాజి రాజా అన్నాడు. కాని ఇప్పుడు తన మీద 69 ఓట్ల మెజారిటీతో గెలిచానని అన్నారు. అయినా సరే 30 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాం.. మిత్రమా శివాజి రాజా నీ మీద ఎలాంటి శత్రుత్వం లేదు. వు లవ్ యు.. వు ఫర్ గివ్ యు.. అందరం కలిసి పనిచేద్దామని అన్నారు నరేష్. ఇక మీ అందరి సాక్షిగా తల్లిద్రండ్రుల సాక్షిగా ఈ ఒక్కసారే తాను మా అధ్యక్షుడిగా ఉంటానని.. ఈ టర్మ్ మంచి పనులు చేసి మంచి లీడర్ షిప్ ఇస్తానని అన్నారు నరేష్. సిల్వర్ జూబ్లీ ఇయర్ మచ్చలు ఏమన్నా ఉంటే తుడిపేసి ముందుకుపోయేలా పని చేస్తామని అన్నారు.. ఓ యజ్ఞంలో మేం ముగ్గురం కలిసి పనిచేస్తామని అన్నారు నరేష్.

పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ.. ఆ సీన్ కోసం 37 టేకులట..!

Read more RELATED
Recommended to you

Latest news