వాళ్లకు భరించే శక్తి లేదు.. టైం వేస్ట్ అంటూ బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్..!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మే 12వ తేదీన అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్నాడు మహేష్ బాబు. ఈ క్రమంలోని సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తూ నే మరొకవైపు ఇతర భాషా చిత్రాల పై తనకున్న అభిప్రాయాలను కూడా వెల్లడిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ పై మహేష్ బాబు చేసిన కామెంట్ల తో జాతీయ మీడియా ఒక్కసారిగా భగ్గుమన్నది. ఇక అసలు విషయం ఏమిటి అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

జాతీయ మీడియా కి చెందిన ఒక రిపోర్టర్ ప్రశ్న వేస్తూ తెలుగులో మీకు మంచి అభిమానులు ఉన్నట్లుగానే హిందీలో కూడా మంచి అభిమానులు ఉన్నారు. అంతే కాదు మీకు దేశం అంతటా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది . మరి బాలీవుడ్ లో ఎప్పుడు సినిమా చేయబోతున్నారు అని ప్రశ్నించగా.. తెలుగులో వస్తున్న సినిమాలనే హిందీ లో రిలీజ్ చేస్తాము.. అలా హిందీ ప్రేక్షకులకు చేరువ అవుతాము. అంతేకానీ ప్రత్యేకంగా హిందీలో సినిమాలు చెయ్యలేము అన్నట్లుగా మహేష్ బాబు మాట్లాడారు.

మరొకసారి బాలీవుడ్ ఎంట్రీ పై ప్రశ్నకు సమాధానం ఇస్తూ .. బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అయితే హిందీ సినీ పరిశ్రమ వాళ్లకు భరించేంత శక్తి ఉందనుకోవడం లేదు. నా టైం ని వేస్ట్ చేసుకోలేను.. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు , ప్రేమ నాకు సరిపోతాయి . తెలుగు ఇండస్ట్రీలో మంచి స్టార్ డమ్ ను సంపాదించుకున్నాను.. ఇక నాకు ఇదే చాలు అని మహేష్ బాబు సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. మహేష్ బాబు కూడా తెలుగు ఇండస్ట్రీని వదిలి వేరే భాషా చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపించడం లేదు అని క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం తెలుగు పై ఉన్న ప్రేమ చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news