మహేష్ బాబు మోకాలి సర్జరీ….. జరిగింది ఇదే….??

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస విజయాలు అందుకున్నారు. ఇక ఇటీవల యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు తో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్, మొత్తానికి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన సరసన స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, సీనియర్ నటి విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు రత్నవేలు ఫొటోగ్రఫీని అందించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో కొద్దిరోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయటానికి అమెరికా వెళ్లారు మహేష్. దాదాపుగా ఫ్యామిలీతో కలిసి ఆయన అక్కడే 3 నెలలు గడపనున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు ఇలా సడన్ గా అమెరికా వెళ్లి అక్కడ అంతకాలం పాటు ఉండడానికి కారణం, ఇటీవల ఆయన మోకాలికి గాయం అయిందని, దాని సర్జరీ కోసమే ఆయన అక్కడకు వెళ్లారని కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా కొందరు మహేష్ బాబు సన్నిహితుల నుండి నేడు అందుతున్న సమాచారం ప్రకారం,

 

అదంతా కూడా ఒట్టి ప్రచారం మాత్రమే అని, గతంలో మహేష్ మోకాలికి గాయం అయిన మాట నిజమే అని, అయితే అది అప్పుడే  మానిపోయిందని, కొన్నాళ్లుగా తీరికలేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న మహేష్, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో అమెరికాకు పెద్ద ట్రిప్ వేశారని అంటున్నారు. రెండున్నర నెలల తరువాత అమెరికా నుండి దుబాయ్ వెళ్తారని, ఆ తరువాత తిరిగి ఇండియాకు వచ్చిన తరువాత  పైడిపల్లి సినిమా మొదలెడతారని అంటున్నారు. దీనితో మహేష్ మోకాలికి శస్త్ర చికిత్స అంటూ వచ్చిన పుకార్లకు అడ్డుకట్ట పడింది….!!

Read more RELATED
Recommended to you

Latest news