క్రిస్ మస్ వేడుకల్లో మహేష్, చరణ్

-

క్రిస్ మస్ వేడుకలలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తున్నాయి. చరణ్ విత్ ఉపాసన, మహేష్ విత్ నమ్రత రెండు ఫ్యామిలీస్ సరదాగా కలిసి క్రిస్ మస్ ఫెస్ట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మహేష్ కూతురు సితారతో ఉపాసన దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఉపాసన కొణిదెల ఈ పిక్స్ తన ట్విట్టర్ లో షేర్ చేసింది. మహేష్, చరణ్ ఇద్దరు మరోసారి తమ సాన్నిహిత్యాన్ని చూపించారు. అటు ఎన్.టి.ఆర్ తో ఇటు మహేష్ తో చరణ్ చేస్తున్న ఈ ఫ్రెండ్ షిప్ ఫ్యాన్స్ లో కూడా నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రస్తుతం చరణ్ వినయ విధేయ రామ సినిమా చేస్తుండగా మహేష్ మహర్షి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news