మహర్షికి సెన్సార్ షాక్..!

-

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వస్తున్న సినిమా మహర్షి. ఈ సినిమాలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. మే 9న రిలీజ్ అవబోతున్న మహర్షి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు మహర్షికి యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు సినిమా చూసి ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. సినిమా సక్సెస్ అవుతుందని అన్నారట.

మహేష్ 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ మహర్షి పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న మహర్షి సినిమా మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. మరి మహర్షి సంచలనాలు తెలుసుకోవాలంటే మరో ఐదు రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news