మహర్షి విలేజ్ సెట్ ఖర్చు ఎంతంటే..!

-

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న మహర్షి. ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న మహర్షి మూవీ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఓ విలేజ్ సెట్ వేశారట. రామోజి ఫిల్మ్ సిటీలో 8 కోట్లు ఖర్చు పెట్టి ఈ విలేజ్ సెట్ వేసినట్టు తెలుస్తుంది.

విలేజ్ లో కీలక సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. అయితే బయట ప్రాంతాల్లో అభిమానుల హంగామా ఉంటుంది కాబట్టి షూటింగ్ కు అంతరాయం కలుగుతుంది. అందుకే ఆరెఫ్సిలోనే విలేజ్ సెట్ వేశారట. కీలక సన్నివేశాలన్ని షూట్ చేయడం మొదలు పెట్టారట. సినిమాలో మహేష్ రైతు బిడ్డగా కనిపిస్తారని అంటున్నారు. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడం లేదు. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న మహర్షి మహేష్ కు మరో హిట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు చిత్రయూనిట్.

Read more RELATED
Recommended to you

Latest news