మహేష్ సినిమా ఆడిషన్ కు వెళ్లి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసా.. సమీరా రెడ్డి

-

టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల పక్కన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమీరా రెడ్డి. కొన్ని సినిమాల్లోనే నటించినా.. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్లు పక్కన కనిపించి అలరించింది. అయితే తాజాగా ఈమె తన కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది..

సమీరా రెడ్డి తన నటనతో పలు అవకాశాలు అందిపుచ్చుకొని టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నటించిన కొన్ని చిత్రాలతో మంచి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈమె తర్వాత పెళ్లి చేసుకొని సెటిలైపోయి సినిమాలకు దూరమైంది. అయితే తాజాగా పాతికేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను సోషల్ మీడియా వేదికగా తెలిపింది..

మహేష్ బాబు సినిమాలో అవకాశం ఉందని తెలిసి ఆడిషన్ కి వెళ్లి సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేసానని చెప్పుకొచ్చింది… “1998లో నేను మొద‌టి సారి ఆడిష‌న్‌కు వెళ్లాను. ఆ సినిమాలో హీరో మ‌హేష్ బాబు. ఆడిష‌న్‌లో ఇచ్చిన టాస్క్ చేయ‌లేకపోయాను. అక్క‌డి నుంచి ఏడ్చుకుంటూ వ‌చ్చేశాను. అంత‌కు ముందు ఏదైతే డెస్క్ జాబ్ చేశానో దాంట్లోకే వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాను. కొంత‌కాలానికి ధైర్యం తెచ్చుకుని ఓ ప్రైవేట్ ఆల్బ‌మ్‌లో ధైర్యంగా న‌టించాను… ” అంటూ తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న సవాళ్లను గురించి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఒక ఫోటోను సైతం పంచుకుంది.. అయితే ఈ ఫోటో చూసిన వారంతా మహేష్ బాబు ఏ సినిమాకి మీరు ఆడిషన్ కి వెళ్లారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మహేష్ రాజకుమారుడు సినిమాకి అయి ఉంటుంది అంటూ చెప్పకు వస్తున్నారు.. అయితే నరసింహుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. జై చిరంజీవ, అశోక్ వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత బిజినెస్ మాన్ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news