ఇకపై మీరే నాకు అమ్మ, నాన్న.. మహేశ్‌బాబు ఎమోషనల్

-

 ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుకలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన తనకు ఇకపై అభిమానులే అమ్మానాన్న అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు- దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరులో అట్టహాసంగా నిర్వహించారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. జవనరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ ఈవెంట్ లో మహేశ్ బాబు అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ.. ఫ్యాన్స్ ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని.. సంక్రాంతి తనకు, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు  బాగా కలిసొచ్చిన పండగ అని అన్నారు. ఆ సీజన్‌లో తమ చిత్రం విడుదలైతే అది బ్లాక్‌బస్టరేనని చెప్పారు. ఈసారి కూడా అదే రిపీట్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. “కానీ, ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనంద పడేవాడిని. ఫోన్‌ కాల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాడిని. ఆ సంగతులన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న’’ అంటూ మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news