రజనీని డామినేట్ చేసిన, మహేష్, బన్నీ…!

-

సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాల్లో ఏ సినిమా విజయం సాధించింది…? రజని కాంత్ నటించిన దర్బార్ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది అన్నారు. ఆ తర్వాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు విడుదల కావడంతో మహేష్ హిట్ కొట్టేసాడు అన్నారు. ఆదివారం విడుదలైన అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలో సినిమా కూడా అదే టాక్ తో దూసుకుపోవడంతో సంక్రాంతి విన్నర్స్ ముగ్గురు అన్నారు.

అయితే ఈ రెండు సినిమాలు విడుదల అయిన తర్వాత మాత్రం రజని కాంత్ దర్బార్ సినిమా వెనక్కు వెళ్ళిపోయిందని అంటున్నారు. మహేష్, బన్నీ సినిమాల ముందు రజని సినిమా ఆప్షన్ గా మారింది అంటున్నారు. ఈ రెండు సినిమాలకు టికెట్ దొరకని వారు ఆ సినిమాకు వెళ్తున్నారని సిని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి రజని ఈ సినిమా ద్వారా మళ్ళీ ఫాం లోకి వచ్చేశారు.

కాని తెలుగులో మాత్రం మహేష్, బన్ని ముందు నిలబడలేకపోయారు. అటు వసూళ్లు కూడా ఈ సినిమాకు పెద్దగా రావడం లేదనే టాక్ కూడా వినపడుతుంది. అల్లు అర్జున్, మహేష్ సినిమాలు రెండు కూడా మంచి విజయాన్ని సాధించాయి. అల్లు అర్జున్ సినిమా అయితే ప్రేక్షకులకు సంక్రాంతి జోష్ ఇచ్చింది. మహేష్ సినిమా మాత్రమే భిన్నమైన టాక్ తో వెళ్తుందని, అబొవ్ యావరేజ్ అని అంటున్నారు ప్రేక్షకులు.

Read more RELATED
Recommended to you

Latest news