Acharya: కొదమ సింహల్లా చిరంజీవి, రామ్ చరణ్..నక్సల్స్‌ గెటప్ పోస్టర్ రిలీజ్

-

ఈ నెల 29న మోస్ట్ టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు కొరటాల శివ, హీరోలు చిరంజీవి, రామ్ చరణ్‌లు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. మరో వైపున చిత్రానికి సంబంధించిన స్టిల్స్ టైం ప్రకారం రిలీజ్ చేస్తున్నారు.

‘ధర్మస్థలి’ కోసం ఇద్దరు యోధులు ‘ఆచార్య’,‘సిద్ధ’లు చేసే పోరాటం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను చిత్రం అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టోరిలో కొరటాల శివ మార్క్ ఉంటుందని, అయితే, కమర్షియల్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్ ను శాటిస్ ఫై చేస్తాయని పేర్కొంటున్నారు.

తాజాగా మేకర్స్ ట్విట్టర్ వేదికగా ‘ఆచార్య’ లోని చిరంజీవి-రామ్ చరణ్ ల పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఆర్మీ వార్ కు వెళ్తున్నట్లు ఇద్దరూ ఆ పోస్టర్ లో చాలా చక్కగా కనిపిస్తున్నారు. మెగా బ్రదర్స్ మాదిరగా వారు ఉండటం గమనార్హం. ఓ మైనింగ్ ఏరియాలో వెనుక జీపులు ఉండగా, ఆర్మీ వార్ డ్రెస్సుల్లో చిరంజీవి, రామ్ చరణ్ చాలా బాగున్నారు.

చిరు-చరణ్ ఇద్దరూ..నక్సలైట్లుగా చిత్రంలో కనిపించబోతున్నారని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఇందులో స్పెషల్ సాంగ్ కూడా ఉంది. యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్ర ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే సాంగ్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news