ఎల్లుండి నుంచే ఓటీటీలోకి రానున్న మళ్లీ-పెళ్లి సినిమా

-

నరేష్, పవిత్ర లోకేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నరేష్, పవిత్ర లోకేష్ కలిసి నటించిన మూవీ మళ్లీ పెళ్లి. రిలీజ్ కు ముందే ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో మాత్రం పెద్దగా ఆడలేకపోయింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటిటి లోకి వస్తుంది.

వచ్చే శుక్రవారం అంటే జులై 23 నుంచి ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో మళ్లీ పెళ్లి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. నిజానికి ఈ మూవీ జూన్ 24 లేదా 25న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మొదట వార్తలు వచ్చాయి. పవిత్ర లోకేష్ ను నరేష్ మూడో పెళ్లి చేసుకోవడం… ఆ ఇద్దరు కలిసే మళ్లీ పెళ్లి టైటిల్ తో సినిమా తీయడం… ట్రైలర్ చూస్తే అచ్చు వీళ్ళ రియల్ లైఫ్ కథనే తెరకెక్కించినట్లు కనిపించడంతో ఈ సినిమాకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. ఆ హైప్ మధ్యలో సినిమా రిలీజ్ అయిన ప్రేక్షకులను మెప్పించలేక బోల్తా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news