షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తున్నాం – తులసిరెడ్డి

-

షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మేనిఫెస్టో వార్ నడుస్తుందని… కాంగ్రెస్ మేనిఫెస్టో ముందు టిడిపి, వైసిపిల మేనిఫెస్టో కాలి గోటికి సరిపోవని ఫైర్‌ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్నవి నిజమైన కుస్తీ పోటీలు కాదని… వైసిపి, బిజెపి మధ్య లాలూచి పోటీ జరుగుతుందని నిప్పులు చెరిగారు.

అమిత్ షా, జేపీ నడ్డ చెప్పేవన్నీ వాస్తవలే… దేశంలోనే నెంబర్ 1 అవినీతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్… అయితే సిబిఐ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో దాడులు ఎందుకు చేయడం లేదన్నారు. కేంద్రం నిధులు దారి మళ్ళిస్తుంటే ఏం చేస్తున్నారని… సిబిఐ ను అవినాష్ రెడ్డి అనుచరులు అడ్డుకుంటుంటే కేంద్రానికి సిగ్గులేదా…! అని ప్రశ్నించారు. బిజెపి అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శలు చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ప్రకటించారు తులసిరెడ్డి. శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో విశాఖ ఎంపీ ఘటన స్పష్టం చేస్తుందని వెల్లడించారు తులసిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news