‘చిత్రలహరి’ ట్రైలర్.. సక్సెస్ కోసం సాయి తేజ్ తిప్పలు..!

-

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ కు జోడీగా కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. శనివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈఎవెంట్ జరుపుకున్న చిత్రలహరి నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు.

సక్సెస్ కోసం కళ్లు కాయలాగా ఎదురుచూస్తున్న విజయ్ అనే కుర్రాడి కథే చిత్రలహరి. కెరియర్ లో సక్సెస్ కోసం తిప్పలు పడుతున్నట్టుగానే సినిమాలో హీరో కూడా సక్సెస్ అందుకోడానికి తెగ ప్రయత్నాలు చేస్తాడు. ఎంతగా అంటే బారులో బేరర్ ను ప్లే సక్సెస్ ఉంటే ఇవ్వమంటూ అడిగేంత అన్నమాట. మొత్తానికి మెగా హీరో చిత్రలహరి ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news