మెగాస్టార్ ను కలిసిన ఏకలవ్య శిష్యుడు..!

-

మెగాస్టార్ చిరంజీవికి నేటితరం యువ హీరోలంతా ఏకలవ్య శిష్యులే అదెలా అంటే ఆయన డ్యాన్స్ చూసి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. చిరంజీవిలాంటి హీరోనవుతా అని ఇంట్లో చెప్పినవారే. అలాంటి ఏకలవ్య శిష్యులలో ఒకరు తనీష్. చైల్డ్ ఆర్టిస్టుగా అందరికి పరిచయం ఉన్న తనీష్ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ఈమధ్య విలన్ గా ఒకటి రెండు ప్రయత్నాలు చేశాడు.

మార్చి 10న జరుగనున్న ‘మా’ ఎన్నికల్లో శివాజి రాజా ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా తనీష్ నిలుచున్నాడు. అయితే ప్రస్తుతం సిని పెద్దగా అందరి బాగోగులు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు తనీష్. దాదాపు 16 ఏళ్ల తర్వాత మెగాస్టార్ ను కలిశాను. మార్చి 5, 2019 జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అంటూ.. జీవితానికి సరిపడిన స్పూర్తిని ఇచ్చారు చిరంజీవి. ఆయనకు నేను ఎప్పుడు ఏకలవ్య శిష్యుడినే. ఆయన చేస్తున్న డ్యాన్సులు చూసి నేను డ్యాన్స్ చేయడం నేర్చుకున్నా అని తన సోషల్ బ్లాగుల్లో పెట్టాడు తనీష్.

ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న శివాజి రాజా పదవి కాలం ముగియడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి శివాజిరాజాకు పోటీగా సీనియర్ హీరో నరేష్ పోటీకి దిగాడు.

Read more RELATED
Recommended to you

Latest news