మంచు వారింట విషాదం.. మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ మృతి

-

కలక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట విషాదం చోటు చేసుకుంది. మంచు మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ (85) ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. తిరుపతి శ్రీవిద్యా నికేతన్లో ఉంటున్న లక్ష్మమ్మ కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ అంతా ఫారిన్ ట్రిప్ లో ఉన్నారు.

తల్లి మరణం తెలుసుకుని వెంటనే తిరుపతి తిరుగు ప్రయాణం పట్టారట మంచు ఫ్యామిలీ. నటుడిగా, నిర్మాతగా మోహన్ బాబు తెలుగు పరిశ్రమలో ఓ ముద్ర వేసుకున్నారు. మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ ఎప్పుడు సినిమా వేడుకలకు రాలేదు. ఆమె మరణ వార్త విని పరిశ్రమ పెద్దలు మోహన్ బాబుకి తమ సానుభూతి తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news