బీసీల‌కు మోహ‌న్ బాబు క్షమాప‌ణ‌లు చెప్పాలి : ఆర్ కృష్ణ‌య్య‌ డిమాండ్

-

టాలీవుడ్ న‌టుడు మంచు మోహ‌న్ బాబు కార్యాల‌యంలో జ‌రిగిన దొంగ‌త‌నం వివాదంలో ముదురుతుంది. ఈ వివాదంలో ముందుగా నాగ శ్రీ‌ను అనే అత‌ను త‌మ కార్యాల‌యం నుంచి దొంగ‌త‌నం చేశాడ‌ని.. మంచు ఫ్యామిలీ ఆరోపించింది. అనంత‌రం నాగ శ్రీ‌ను సెల్పీ వీడియోలో.. త‌న‌ను మంచు ఫ్యామిలీ ఇబ్బందులకు గురి చేశార‌ని.. కులం పేరుతో దూషించార‌ని అన్నారు. అలాగే త‌న‌పై దొంగ త‌నం కేసును కూడా మోపుతున్నార‌ని ఆరోపించారు.

కాగ సినీ న‌టుడు మోహ‌న్ బాబు.. నాగ శ్రీ‌ను కులం పేరుతో దూషించాడ‌నే వార్త‌లు బ‌య‌ట‌కు రాగానే.. బీసీ సంఘాలు మోహన్ బాబుపై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశాయి. తాజా గా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ‌య్య కూడా వివాదం పై స్పందించాడు. టాలీవుడ్ లో సీనియ‌ర్ న‌టుడుగా ఉండి… ఒక వ్య‌క్తిని కులం పేరుతో దూషించ‌డం దారుణం అన్నారు. నాగ శ్రీ‌ను కులంతో పాటు బీసీలు అంద‌రికీ మోహ‌న్ బాబు క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లేక పోతే.. మోహ‌న్ బాబు తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news