ప్రభాస్ కి మ్యూజిక్ డైరెక్టర్లు కలిసిరావడం లేదా..?

-

సాహో సినిమాతో వెనక్కు తగ్గిన ప్రభాస్ మళ్లీ లవర్ బాయ్ గా మారబోతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనున్న సినిమాలో జిల్ ఫేమ్ రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మధ్యనే మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫం అయిన అమిత్ త్రివేది మళ్లీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నారని సినీ వర్గాల కథనం. దీనికి కారణం తెలియరాలేదు.

ఇంతకు ముందు సాహో సినిమా షూటింగ్ లో కూడా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ల త్రయం శంకర్, లాయ్, ఎహసాన్ కూడా ఆ సినిమా మధ్యలోనే వదిలేశారు. అప్పట్లో దానికి కారణం సాహో సినిమా నిర్మాతలు పాటల కాంపోజిషన్ పూర్తి బాధ్యత నీ వాళ్లకు ఇవ్వలేదనీ అందుకే వారు ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మళ్లీ ఇప్పుడు కూడా ఇలాగే జరిగినందుకు ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

అయితే ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉన్నారు . 200 వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో, మహానటి సినిమాతో హిట్ కొట్టిన యువ దర్శకుడు  నాగ అశ్విన్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే ఈ సినిమా విడుదల ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news