నాని సినిమాకు క‌రోనా క‌ష్టాలు..!!

-

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న‌ యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంతో నివేద థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇన్నాళ్లు చాలా సాఫ్ట్‌గా పక్కింటి కుర్రాడిలా తన నేచురల్ నటనతో ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో మాత్రం నెగిటివ్ షేడ్స్‌లో క‌నిపించ‌నున్నారు.

అలాగే దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. మ‌రియు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఉగాది సందర్భంగా ఈ నెల 25న సినిమాను విడుదల చేయాలనుకున్నారు చిత్ర‌యూనిట్‌. అయితే విడుదల తేదీ విషయంలో చిత్రయూనిట్ ఆందోళనగా ఉందట. ప్రస్తుతం సినిమాలకు బ్యాడ్ సీజన్ నడుస్తోంది.

కరోనా వైరస్ కారణంగా జనాలు థియేటర్ల వైపు వెళ్లడానికి భయపడుతున్నారు. మ‌రోవైపు ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సీజన్. సినిమాలపై జనాలకు పెద్దగా ఆసక్తి ఉండదు. ఇక, ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. అది సినిమాపై మరింత ప్రభావం చూపుతుంది. దీంతో వి చిత్ర యూనిట్ విడుద‌ల తేదీ విష‌యంలో ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టుతెలుస్తోంది. అయితే సినిమా వాయిదా వెయ్యాలా.. వ‌ద్దా.. అన్న‌ది దిల్ రాజ్ డిసైడ్ చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news