జబర్దస్త్ కి కొత్త యాంకర్.. రష్మీ కూడా తప్పుకున్నట్టేనా..?

-

గత కొద్ది రోజుల నుంచి జబర్దస్త్ నుంచి అటు జడ్జ్ లు, యాంకర్లు అలాగే కమెడియన్లు కూడా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనసూయ, సుడిగాలి సుదీర్ కూడా వెళ్లిపోవడంతో అటు జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకి ఏకైక యాంకర్ గా రష్మీ కొనసాగుతూ ఉండడం గమనార్హం . మరి ప్రస్తుతం మూడు షోలు చూసుకోవడం ఈమెకు కష్టమవుతుందో లేక సినిమాలపై దృష్టి సారిస్తోందో తెలియదు కానీ ప్రస్తుతం జబర్దస్త్ కి కొత్త యాంకర్ ను తీసుకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారింది.

ఈ కొత్త యాంకర్ గ్లామర్ విషయంలో అనసూయ, రష్మీ కూడా ఈమె ముందు సరిపోరు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మీకి అదనపు బాధ్యతలు బాగా పెరగడంతో ఆమె చేయలేని పరిస్థితి ఏర్పడింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈతరుణంలోనే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి రష్మీ జబర్దస్త్ లో కనిపించదని చెప్పవచ్చు. ఆమె ఎక్స్ట్రా జబర్దస్త్ కు మాత్రమే పరిమితం అవుతుంది. దానికి కారణం ఇప్పుడు కొత్త యాంకర్ ను కూడా తీసుకురావడమే అయితే ఈ విషయాన్ని కూడా అధికారిక ప్రకటన చేసేసారు. ఆమె ఎవరో కాదు సీరియల్స్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న సౌమ్యరావు..

మంచి హైట్, కలర్ , స్లిమ్ బాడీ తో సూపర్ గ్లామరస్ గా ఉంది ఈ కొత్త యాంకర్ . ఫస్ట్ ఎపిసోడ్ లోనే తన మార్కు చూపించిన ఈమెకు జడ్జెస్ , కమెడియన్స్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక ఆది కొత్త యాంకర్ అని చూడకుండా తన పంచులతో రెచ్చిపోయాడు. సౌమ్య రావు కూడా ఎక్కడా తగ్గకుండా తనదైన శైలిలో పంచ్ ల వర్షం కురిపించింది. మరి ఈమె ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news