యు వి క్రియేషన్స్ లో శర్వానంద్ కొత్త సినిమా .. ప్రభాస్ కి శర్వానంద్ అంతిష్టమా ..?

-

తెలుగు ఇండస్ట్రీలో శర్వానంద్ ప్రస్థానం సినిమా నుండి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని మంచి హిట్స్ అందుకుంటూ సాగుతున్నాడు. ఎవరి అండ దండలు లేకుండానే శర్వానంద్ హీరోగా పాపులారిటీని సాధించాడు. కమర్షియల్ హీరో అన్న ఇమేక్ కోసం పాకులాడకుండా శర్వానంద్ ఎంచుకునే కథలు కొత్త గా ప్రజెంట్ చేశాయి. అయితే శతమానం భవతి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు శర్వానంద్ మంచి హిట్ దక్కించుకోలేకపోయాడు.

 

పడి పడి లేచెమనసు, రణ రంగ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న తమిళ 96 రీమేక్ జాను కూడా శర్వానంద్ ని తీవ్రంగా నిరాశ పరచింది. దాంతో మరోసారి శర్వానంద్ శతమానం భవతి వంటి సినిమానే చేస్తున్నాడు. ‘శ్రీకారం’ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే శర్వా ‘శ్రీకారం’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ లో నటించనున్నాడు. లాక్ డౌన్ ఎత్తేయగానే శర్వా ఈ సినిమాలోనే నటించబోతున్నాడు.

ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల తెరకెక్కించనున్నాడు. ఇదిలా ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కునున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్లో శర్వా నటించే మూడో సినిమా కావడం విశేషం. ఇక ప్రభాస్ కి శర్వా అంటే ప్రత్యేకమైన అభిమానం అని స్వయంగా ప్రభాస్ ఒక సందర్భంలో వెల్లడించాడు. ఆ కారణంగానే యూవీ క్రియేషన్స్ లో బ్యాక్ టు బ్యాక్ శర్వా తో సినిమాలు నిర్మిస్తున్నాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news