కరోనా సెగలోను తగ్గని సర్కారువారి పాట బిజినెస్…!

-

మహేష్ బాబు పర్సనల్ గానే కాదు.. సినిమా పరంగాను బిజినెస్ మేన్ అనిపించుకుంటున్నాడు.తన గత సినిమాల రిజల్ట్స్ తో సంబందం లేకుండా తనకున్న స్టార్ డమ్ తో సినిమా సినిమాకు తన మార్కెట్ బిజినెస్ అలా పెంచుకుంటూనే పోతున్నాడు.తాజాగా సర్కారువారి పాట సినిమాకు ఇదే పని చేశాడు. మహేష్ మేనియా ఎలా ఉందో ఇటు టాలీవుడ్ కే కాదు… అటు బాలీవుడ్ నటీనటులతో యాడ్ లు చేసే కార్పొరేట్ కంపెనీలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.ప్రిన్స్ స్టామినా ఏంటో…

తాజాగా మహేష్ నటిస్తున్న సర్కారువారిపాట సినిమా ఆఫ్టర్ లాక్ డౌన్ షూట్… ఇంకా మొదలే కాలేదు.అప్పుడే ఈ ఫిలింకు సంబందించిన బిజినెస్… గట్టిగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది.దాదాపు120కోట్ల బడ్జెట్ తో ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ ఫిలింకు… ఇప్పుడు వందకోట్ల వరకు బిజినెస్ జరిగినట్లుగా టాక్ వినిపిస్తుంది. పలు భాషల్లో శాటిలైట్ హక్కుల పరంగా భారీ స్థాయిలో ఈ బిజినెస్ జరిగిందని అటు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటి వరకు మహేష్ సినిమాలంటే.. భారీ బిజినెస్ తో పాటు భారీ వసూళ్లను రాబడతాయని తెలుసు. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్ల వ్యవస్థ ఉంటుందో లేదో తెలియని ఈ టైమ్లో ప్రిన్స్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ అంటే మాములు విషయం కాదు.ఇప్పటికే ప్రి లుక్ ,మోషన్ పోస్టర్ టీజర్లతో అదరగొట్టిన ప్రిన్స్ ..పరశురామ్ సినిమాతో ఎలాంటి ఎఛీవ్ మెంట్ సాదిస్తోడోనని అందరూ ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ,14 రీల్స్ ఎంటెర్టైన్మెంట్స్ తో పాటు మహేష్ కూడా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news