సరికొత్తగా ‘కార్తీకేయ-2’ ప్రపంచం..పాత్రలను పరిచయం చేసిన మేకర్స్

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తీకేయ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ ‘కార్తీకేయ-2’ అతి త్వరలో రాబోతున్నది. వచ్చే నెల 22న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

ఇటీవల ‘కార్తీకేయ-2’ చిత్రం నుంచి ఫస్ట్ మోషన్ పోస్టర్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా..పాన్ ఇండియా ఫిల్మ్ ‘కార్తీకేయ-2’లోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. అతిపెద్ద ప్రపంచ రహస్యం ఈ ద్వారకా నగరం..కాగా, ఆ రహస్య ఛేదన కోసం బయలు దేరిన ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.

కార్తీకేయగా నిఖిల్, ముగ్ధగా అనుపమా పరమేశ్వరన్, ధన్వంతరిగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ , సదానంద్ గా శ్రీనివాస్ రెడ్డి , సులేమాన్ గా హర్ష చెముడు, సంతానుగా ఆదిత్య మీనన్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news