నిఖిల్ “కార్తికేయ 2” నుంచి ‘నన్ను నేను అడిగా’ వీడియో సాంగ్ రిలీజ్

-

చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ కథనాయకుడిగా వచ్చిన సినిమా కార్తికేయ. ఈ సినిమా ఊహించని బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలో నిఖిల్‌ హీరోగా, అనుపమ పరమేశ్వర్‌ జంటగా కార్తికేయ-2 సినిమాను తెరకెక్కించారు.. అయితే.. ఈ సినిమాను పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు.విడుదల తేదీ దగ్గర పడుతుండగా మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ కూడా చేసారు.

ఇందులో భాగంగా తాజాగా ”కార్తికేయ 2” ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆసక్తికర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ మరియు గ్లిమ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.అయితే తాజాగా ఆగస్టు మొదటి వారానికి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో హీరో నిఖిల్ పోస్ట్ చేస్తూ.. సినిమా వాయిదా పడుతున్నందుకు క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టాడు.ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం ఈ సినిమా నుండి ఓ వీడియో పాట ని విడుదల చేసింది చిత్రబృందం. హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ మధ్య “నన్ను నేను అడిగా” అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news