పాన్ ఇండియా సినిమా డైరెక్టర్ గా నిత్యామీనన్..! ఆ మూడు పాత్రల్లో….

-

nithya menon to direct a pan india movie
nithya menon to direct a pan india movie

రింగులు తిరిగిన కురులు పెద్ద కళ్ళతో మంచి ఎక్స్ప్రెషన్స్ తో మనందరిని ఆకట్టుకున్న కథానాయిక నిత్యామీనన్.. ఈ మలయాళ భామ ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఇష్క్ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. నిత్య మీనన్ చివరిసారిగా కనిపించిన తెలుగు సినిమా గీతాగోవిందం. అప్పటినుండి ఈ సుందరి ప్రేక్షకులకి కనిపించడం లేదు. మ్యాటర్ ఏంటంటే ఈమధ్య నిత్య మీనన్ తన వద్దకి వచ్చిన సినిమాలను వేటినీ సైన్ చేయడం లేదు. వచ్చిన క్యారక్టర్ తనకి నచ్చడం లేదని చెబుతుందట…! కానీ నిజానికి నిత్యా ఇప్పుడు సినిమాలకి కథలు సిద్ధం చేసే పనిలో పడిందట. తనకి డైరెక్షన్ వైపు మక్కువ ఉందని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పిన ఈ సుందరి ఇప్పుడు డైరెక్షన్ రంగంలోకి దిగుదామని చూస్తుంది. అందుకుగాను ఇప్పటికే మంచి స్క్రిప్ట్ లు సిద్ధం చేసుకుంటుంది. ఈ లాక్ డౌన్ కాలంలో రెండు స్క్రిప్ట్ లు సిద్ధం చేసుకోగా అందులో ఒకదానికి ప్రొడ్యూసర్లను సైతం పట్టేసింది. ఆ సినిమాలో నిత్య నటించడంతో పాటు డైరెక్షన్ ప్రొడక్షన్ కూడా చేస్తుందని టాక్. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా తరహాలో తీయాలని ఆ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటుంది. అనేక భాషల్లో అనేకమంది నటులతో ప్రతీ భాషకి డిఫరెంట్ హీరోని పెట్టి సినిమా తీయాలని ఆమె డిసైడ్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news