మహేష్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరోయిన్ ?

-

మహేశ్ బాబు ప్రజెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు. ‘అతడు’, ‘ఖలే జా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి.

ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఆ బాలీవుడ్‌ భామ ఎవరో కాదు.. నోరా ఫతేహి అని తెలుస్తోంది. అంతేకాదు… ఈ సినిమాలో నోరా ఫతేహి విలన్‌ రోల్‌ లో కనిపించబోతుందట. ఐతే, ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news