మరొక్కసారి పవన్ ఫ్యాన్స్ ని కెలికిన పూనమ్…..!!

-

టాలీవుడ్ వర్ధమాన నటి పూనమ్ కౌర్, ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించారు. మొదట్లో కొన్ని సినిమాల్లో నటించిన పూనమ్ కౌర్, అందులో ఎక్కువ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక కొన్నాళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేసినట్లుగా ఆమె పేరుతో పలు ఆడియో క్లిప్పులు లీక్ కావడం జరిగింది. తన సినిమా లైఫ్ నాశనం అవడానికి టాలీవుడ్ లోని ఒక ప్రముఖ దర్శకుడు పరోక్షంగా కారణం అని, అలానే తనకు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అవకాశం వచ్చినప్పటికీ, ఆ దర్శకుడి వల్లనే అది మిస్ అయిందని,

అలానే పవన్ కళ్యాణ్ ను తాను ప్రేమించానని కూడా ఆ ఆడియో టేప్ లో ఉంది. అయితే అవి తన వాయిస్ తో వచ్చినవి కావని, ఎవరో తనపై కుట్రతో అవి క్రియేట్ చేసారని ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఆ ఆడియో టేప్స్ తో పవన్ ఫ్యాన్స్  పూనమ్ పై విమర్శలు చేయడం జరిగింది. కాగా నేడు మళ్ళి పూనమ్ కౌర్ ఒకింత పవన్ కు చురకలు అంటించేలా ఒక ట్వీట్ చేసింది. ’’దిశా హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు థ్యాంక్స్, ఇలానే నాతో పాటు మరికొందరు మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను కూడా శిక్షిస్తారని భావిస్తున్నాను… ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు’’ అంటూ పూనమ్ ట్వీట్ చేయడం జరిగింది. కాగా ఈ ట్వీట్ పూనమ్, పవన్ ని ఉద్దేశించి చేసిందని, ఎందుకంటే ఇటీవల జరిగిన దిశా హత్య కేసు నిందితులను ఉరి శిక్ష వేయకుండా నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయండి పవన్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని పూనమ్ ఈ ట్వీట్ చేసిందని, ఈ విధంగా తమ హీరోను పూనమ్ టార్గెట్ చేయడంపై మరొక్కసారి పవన్ ఫ్యాన్స్ ఆమె పై సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోలింగ్ మొదలెట్టారు. కాగా కాసేపటి తరువాత పూనమ్ ఈ ట్వీట్ ని తొలగించింది….!!

Read more RELATED
Recommended to you

Latest news