వకీల్ సాబ్ కంప్లీటయ్యాకే క్రిష్ సినిమాలో జాయిన్ అవనున్న పవన్ కళ్యాణ్ ..?

-

బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సినిమా కోలీవుడ్ లో అజిత్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. రెండు భాషల్లోన్ను 100 కోట్ల పైనే వసూళ్ళు రాబట్టింది ఈ సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ తో రెండేళ్ళ తర్వాత గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.

 

నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాశ్ రాజ్, నరేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నారు. అయితే ఇప్పటికేఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసందే. ఇక ఈ సినిమాకి మొత్తం మీద నెల రోజులు వర్క్ మాత్రమే పెండింగ్ ఉందని ఆ మద్యన దర్శకుడు తెలిపాడు. వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ సినిమాని సమాంతరంగా చేద్దామని డేట్స్ సర్ధుబాటు చేశారట.

అయితే ఇప్పుడు అలా కుదరదని తెలుస్తోంది. కరోనా కారణంగా లాక్ డౌన్ ఎత్తేయగానే ముందు శరవేగంగా వకీల్ సాబ్ సినిమాకి ఉన్న బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేశాకే క్రిష్ సినిమాలో జాయిన్ అవుతారని సమాచారం. క్రిష్ కూడా ముందు పక్కాగా వకీల్ సాబ్ పనులు పూర్తయ్యాకే తన సినిమా పనులు మొదలు పెడతారట. ఒకసారి క్రిష్ సినిమా మొదలు పెడితే నాన్ స్టాప్ గా సినిమాని ఫినిష్ చేయాలన్న ఆలోచనలో ఇద్దరు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ హరీష్ శంకర్ సినిమా చేస్తారని అంటున్నారు. ఒకేసారి సినిమాలు ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ అండ్ డైరెక్టర్స్ ప్లాన్ కాస్త మారిపోయినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news