భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డ‌ప్పులు వాయించిన ప‌వ‌న్‌, కేటీఆర్

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ ఘ‌నంగా జ‌రుగుతుంది. ఈ వేడుక‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌, డ్ర‌మ్స్ స్పెష‌లిస్ట్ శివ‌మ‌ణి భీమ్లానాయ‌క్ మూవీల్లో పాట‌ల‌కు ప‌ర్పార్మ్ చేస్తూ డ్ర‌మ్స్ వాయించారు. వారిద్ద‌రూ క‌లిసి డ్ర‌మ్స్ వాయించారు. వీరిద్ద‌రూ క‌లిసి డ్ర‌మ్స్ వాయిస్తూ ఉండ‌గా శివ‌మ‌ణి వెళ్లి హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను, మంత్రి కేటీఆర్‌ను స్టేజీ మీద‌కు తీసుకొచ్చి వారితో డ్ర‌మ్స్ వాయించేలా చేసారు. ప‌వ‌న్‌, కేటీఆర్ అభిమానులు కేరింత‌లు కొట్టారు.

ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిత్యామీన‌న్ రానా స‌ర‌స‌న సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈసినిమాకు త్రివిక్ర‌మ్ మాట‌లు రాసారు. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను భారీ వ్య‌యంతో నిర్మించారు. ఈ సినిమాపై ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల అవ్వ‌నుంది. ఇప్ప‌టికే ఈ సినిమా పాట‌లు, ట్రైల‌ర్లు యూట్యూబ్‌ను షేక్ చేస్తుండగా.. కొత్త ట్రైల‌ర్ సినిమా హైప్ ను పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news