క్రికెటర్‌ రషీద్‌ కు పవన్‌ కళ్యాణ్‌ భారీ సాయం

-

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలు చేసుకుంటూనే.. రాజకీయాల్లోనూ చాలా బాగా రాణిస్తున్నారు పవన్‌ కళ్యాణ్‌. సినిమాలు, రాజకీయాలే కాకుండా… పవన్‌ కళ్యాణ్‌ చాలా సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరు చేయి చాచి అడిగినా సరే.. లేదనకుండా.. సాయం చేసే గొప్ప గుణం పవన్‌ కళ్యాణ్‌ సొంతం.

ఇప్పటికే ఎంతో మందికి సాయం చేసి.. చాలా మంది గుండెల్లో దేవుడిగా నిలిచాడు. అయితే.. తాజాగా టీమిండియా అండర్‌ -19 వరల్డ్‌ కప్‌ టీం వైస్‌ కెప్టెన్‌.. గుంటూరు క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ కు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. టీమింబియా యువ జట్టు కప్‌ నెగ్గడం లో రషీద్‌ ముఖ్య భూమిక పోషించిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో.. క్రికెటర్‌ రసీద్‌ ను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చినట్లు పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. ఇందులో భాగంగానే ఏపీ జనసేన పార్టీ కార్యదర్శి మార్కండేయ.. పవన్‌ కళ్యాణ్‌ తరఫున రూ.2 లక్షల చెక్‌ ను రషీద్‌ కుటుంబానికి అందజేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news