పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఔట్!

-

మెగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది..

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి వెండి తెరను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి నటించినున్నారనే వార్త మెగా అభిమానులకు సర్ప్రైజ్ గా మారింది. కాగా ఈ సినిమా జులై 28వ తారీఖున విడుదల కానున్నట్టు ప్రకటించేసింది చిత్ర బృందం.

తమిళంలో రూపొందిన ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. తమిళంలో డైరెక్ట్ చేసి, నటించి హిట్ కొట్టిన సముద్రఖనినే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. గతనెల ఫిబ్రవరి 22న అధికారికంగా లాంచ్ అయి షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది.

కాగా ఓ యువకుడు కారు యాక్సిడెంట్ లో మరణిస్తే దేవుడు అతనికి రెండో అవకాశం ఇస్తాడు. తమిళంలో ఇదే కాన్సెప్ట్ గా రాగా తెలుగులో సైతం ఇదే నేపద్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మాటలు స్క్రీన్ ప్లే మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తుండగా కేతికాశర్మ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటించనున్నట్టు తెలుస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ చేతిలో మరో మూడు చిత్రాలు ఉన్నాయి.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలపైనా భారీ అంచనాలు నెలకొని ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news