పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కోసం పారితోషకం అన్ని కోట్లా..?

-

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు సినిమాలలో కూడా బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే ఓజీ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కేవలం 35 రోజులు మాత్రమే డేట్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇక బ్రేక్ లెస్ షూటింగ్ తో మరో 20 రోజుల్లో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఉస్తాధ్ భగత్ సింగ్ , హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లు కూడా ఒకేసారి పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఏకంగా 75 కోట్ల రూపాయల మేర పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ రోజుకు రూ .2కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం.

 

ప్రభాస్ తో సాహో సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టిపడింది. ఇకపోతే సాహో తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో సుజిత్ చాలా నమ్మకంతో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news