హీరో రాజ‌శేఖ‌ర్‌కు ప్లాస్మా థెర‌పీ

-

డా. రాజ‌శేఖ‌ర్ క‌రోనా సోక‌డంతో గ‌త కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వ‌దంతులు వినిపించ‌డంతో సిటీ న్యూరో సెంట‌ర్ ఇటీవ‌ల హెల్త్ బులిటెన్‌ని విడుద‌ల చేసింది. ఆయ‌న ఆరోగ్యంగానే వున్నార‌ని, ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నామని వెల్ల‌డించారు. తాజాగా మ‌రోసారి సిటీ న్యూరో సెంట‌ర్ హెల్త్ బులిటెన్‌ని విడుద‌ల చేసింది.

రాజ‌శేఖ‌ర్ ట్రీట్‌మెంట్ కి స్పందిస్తున్నార‌ని వెల్ల‌డించిన ఆసుప‌త్రి వ‌ర్గాలు తాజాగా ఆయ‌న‌కు ప్లాస్మా థెర‌పీతో వైద్యం అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గ‌తంతో పోలిస్తే ఆయ‌న ట్రీట్‌మెంట్‌కి బాగా నే స్పందిస్తున్నార‌ని, గ‌తంలో పోలిస్తే రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం బాగా మెరుగైంద‌ని తాజా బులిటెన్‌లో స్ప‌@్టం చేశారు.

ఇటీవ‌ల రాజ‌శేఖ‌ర్ చిన్న కుమార్తె నాన్న కోవిడ్‌తో పోరాడుతున్నార‌ని, చాలా క‌ష్టంగా వుంద‌ని, వెంటిలేట‌ర్‌పై వున్నార‌ని, ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డాల‌ని అంతా ప్రార్థించండ‌ని ట్వీట్ చేయ‌డంతో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించిందంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి. దీంతో మ‌రోసారి స్పందించిన శివాత్మిక పుకార్ల‌ని ప్ర‌చారం చేయెద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news