ఓటీటీలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’

-

సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించింది. గత ఏప్రిల్‌ 28న ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. కానీ కండిషన్స్ అప్లై. ఎందుకంటే ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

అమెజాన్‌ ప్రైమ్‌వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రైమ్‌ సభ్యత్వంతో సంబంధం లేకుండా రూ.399 చెల్లించి ఎవరైనా ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’చూడొచ్చు. ఒకసారి అద్దె చెల్లించి సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో పూర్తి చేయాలి. మిగిలిన అన్ని షరతులు వర్తిస్తాయి. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌బచ్చన్‌, జయం రవి, కార్తి, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మొదటి భాగానికి అంతగా ఆదరణ లేకపోయినా.. ఫస్ట్ పార్ట్​లో క్లైమాక్స్ వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్​ను మణిరత్నం మెయింటైన్ చేయడం.. పార్ట్-2కు కలిసొచ్చందని సినీ వర్గాల టాక్.

Read more RELATED
Recommended to you

Latest news