పూజా ప‌ని అయిపోయిందన్నారు..ఇప్పుడే ఏలేస్తుంది

-

పూజా హెగ్డే..ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్  హీరోయిన్‌. స్టార్ హీరోయిన్ల‌లో ఓ హాట్ కేక్‌. కానీ గ‌తం వేరు.  కెరీర్ బిగినింగ్‌లో రెండు సినిమాలు చూసి ఇక పూజా ప‌ని అయిపోయింది. ఒకానొక ద‌శ‌లో పూజా క‌నుమ‌రుగ‌య్యింద‌నే కామెంట్స్ వ‌చ్చాయి. వాట‌న్నింటిని ప‌టాపంచ‌లు చేసి ఇప్పుడు నంబ‌ర్ వ‌న్ రేస్‌లో ఉంది. పూజా తెలుగులో 2014లో ఒక లైలా కోసం చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. నాగ‌చైత‌న్య హీరోగా విజ‌య్ కుమార్ కొండా డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ రొమాంటిక్ ఫిల్మ్ యావ‌రేజ్ గానే నిలిచింది. అదే ఏడాది వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి ముకుంద చేసింది. ఇది కూడా మిక్స్ డ్ రిజ‌ల్ట్ నే ఎదుర్కొంది. ఈ రెండు చిత్రాల్లో క్యూట్ అందాల‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. కానీ బాలీవుడ్ లో హృతిక్ రోష‌న్ తో క‌లిసి న‌టించే అరుదైన ఆఫ‌ర్ ఆమెని వ‌రించింది. దాదాపు టూ ఇయ‌ర్స్ ఈ సినిమా కోసమే కేటాయించింది. 2016లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వ‌ద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. దీంతో ఇక పూజా ప‌ని అయిపోయింద‌న్నారు.

pooja hegde Maia in tollywood

చాలా రోజుల వ‌ర‌కు నెక్ట్స్ ఆఫ‌ర్స్ రాలేదు. ఈ నేప‌థ్యంలో అదృష్టం అల్లు అర్జున్ రూపంలో ఆమె త‌లుపు త‌ట్టింది. హ‌రీష్ శంక‌ర్ రూపొందించిన డీజే(దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌)లో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. తెలుగులో ఆమెక‌దే పెద్ద ప్రాజెక్ట్. ఈ సినిమా విజ‌యం ఆమె కెరీర్‌కి ట‌ర్న్ ఇచ్చింది. ఇందులో హాట్ అందాలతో మెస్మ‌రైజ్ చేసింది. దీంతో ఇండ‌స్ట్రీలో అంద‌రిని దృష్టిని ఆక‌ర్షించింది. ఆ వెంట‌నే బెల్లంకొండ‌తో సాక్ష్యం,  ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత చిత్రాలు చేసింది. ప్ర‌స్తుతం మహేష్‌తో కలిసి నటించిన ‘మహర్షి’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తోంది. అలాగే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా మెరవనుంది.

మరోవైపు బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’లోనూ నటిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా మ‌రో ల‌క్కీ ఛాన్స్ ఆమెని వ‌రించింది. ముకుంద త‌ర్వాత మ‌రోసారి వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి న‌టించేందు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వరుణ్‌తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ ‘వాల్మీకి’ పేరుతో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. తమిళంలో వచ్చిన సూపర్‌ హిట్‌ ‘జిగర్తాండా’కిది రీమేక్‌. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కథానాయిక కోసం పలువురిని అనుకున్నప్పటికీ ఫైనల్‌గా పూజాని ఖరారు చేశారట. ఈ సినిమాకి ఆమె కేవ‌లం 15 రోజుల కాల్షీట్స్ మాత్ర‌మే కేటాయించింద‌ట‌. దీని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు ఇప్ప‌డు పూజా ఎంత బిజీయెస్ట్ హీరోయినో, ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో.

Read more RELATED
Recommended to you

Latest news