ప్రభాస్, మారుతి మూవీ ఫుల్ ఎంటర్టన్మెంట్ గా.!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్ చూసి బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా కుళ్ళు కుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రోజెక్ట్ కె, స్పిరిట్ ఇలా ఉంది మనోడి సినిమాల జాబితా ఇవన్ని 2000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు ఉన్నాయంటే ప్రభాస్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇది ఇప్పటి వరకూ ఇండియాలో ఎవరికి సాధ్యం కాని రికార్డ్ అందుకే సూపర్ స్టార్ గా ఉన్నాడు. వీటి అన్నింటి మధ్యలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.హారర్ కామెడీ నేపథ్యంతో సాగే స్టోరీ ఇది. ఒక థియేటర్ చూట్టూ తిరిగే కథ. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు.ఇక అచ్చమైన తెలుగు సినిమా డైరెక్టర్ ఈ సినిమా తీస్తుండడం తో ఇందులో తెలుగు ప్రేక్షకులు కోరుకునే కామిడీ, రొమాన్స్ అంశాలు ఉంటాయని అంటున్నారు

తాజాగా ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న కార్తీక్ పలని ఒక అప్డేట్ ఇచ్చారు. విజయ్ వారసుడు సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన కార్తీక్ పలని ఆ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ సినిమా గురించి అసలు విషయం బయట పెట్టాడుప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటికీ పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందులో నవ్వించే, కవ్వించే అంశాలు ఉన్నాయని ఆయన  చెప్పుకొచ్చాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news