సాహో “బాహుబలి”.. ప్రభాస్‌ 4 కోట్ల భారీ విరాళం

-

యంగ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు. ఆయన ఏదైనా పని చేస్తే దేశం మొత్తం గమనిస్తూ ఉంటుంది. ఆ స్థాయికి తగ్గట్టే చేయాల్సి ఉంటుంది. కరోనాతో పోరాడటానికి, ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వాలకు సాయంగా నిలబడానికి సినీ తారలంతా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తమకు తోచినంత ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రెండు కోట్లు, మహేష్ బాబు కోటి, రామ్ చరణ్ 75లక్షలు, ఎన్టీఆర్ 25 లక్షలు, త్రివిక్రమ్ 20 లక్షలు, కొరటాల శివ 20 లక్షలు, అనిల్ రావిపూడి 10 లక్షలు, సాయి ధరమ్ తేజ్ పది లక్షలు, నితిన్ 20 లక్షలు ఇలా ఎవరికి తగ్గట్టు వారు విరాళంగా ఇస్తూ వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.

అయితే డార్లింగ్ ప్రభాస్ మాత్రం తన బాహుబలి అంత పెద్ద మనసును చాటుకున్నాడు. ఏకంగా నాలుగు కోట్ల విరాళాన్ని ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నాడు. ఇందులో మూడు కోట్లు కేంద్ర ప్రభుత్వానికి, రూ. 50 లక్షల చొప్పున రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news