Chiranjeevi: ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు..ఏర్పాట్లు షురూ!

-

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’ అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి- మె గా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను ఇంకా పెంచేసింది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్..డెఫినెట్ గా రికార్డులన్నిటినీ తిరగ రాస్తుందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తండ్రీ తనయులు చిరు-చెర్రీలను వెండితెరపైన చూసి మెగా అభిమానులు సంబురాలు చేసుకోనున్నారు.ఈ నెల 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ సభ్యులు ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసినట్లు వినికిడి.

టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం ఈ నెల 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందట. ఇందుకు ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, గతంలో ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈవెంట్ ఏపీలోని విజయవాడ ఇంద్ర కీలాద్రి అమ్మవారి సన్నిధిలో జరుగుతుందట.

‘ఆచార్య’ పిక్చర్ లో అమ్మవారి ప్రస్తావన, స్టోరి దేవాలయాల నేపథ్యంలో ఉండటం, సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో కనక దుర్గమ్మ వారి ఆశిస్సులు సినిమాకు ఉండాలనే భావనతో విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news