పూజా హెగ్డే, రష్మిక మందన్నల కి చెక్ పెట్ట బోతున్న పూరి జగన్నాధ్ హాట్ హీరోయిన్ ..!

-

ఎప్పుడు టాలీవుడ్ లో మన దర్శక నిర్మాతల కన్ను బాలీవుడ్ హీరోయిన్స్ మీదే ఉంటుంది. కావలసినంత గ్లామర్ గా కనిపిస్తారు. స్క్రీన్ మీద అందాల ఆరబోతకి అసలు ఏమాత్రం అడ్డు చెప్పరు. ఇలా చాలా లెక్కలేసుకుంటే మన తెలుగు అమ్మాయిల కంటే ముంబై మోడల్స్ మీదే మన మేకర్స్ కి ధ్యాస ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం లో బాలీవుడ్ భామలేమీ తక్కువ తినలేదు. ఎలాగైనా తెలుగు సినిమాలలో ఛాన్స్ దక్కించుకొని టాలీవుడ్ లో జండా పాతేయాలని చూస్తున్నారు. ఇక్కడ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్స్ గా వెలగాలని కొందరు బాలీవుడ్ హీరోయిన్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే ఈసారి టాలీవుడ్ లో ఓ స్పెషల్ అట్రాక్షన్ ఉండబోతోంది. అదేమిటంటే బాలీవుడ్ కు చెందిన ఇద్దరు ప్రముఖుల కూతుళ్లు ఇప్పుడు ఒకేసారి టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

 

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండేను సెలెక్ట్ చేసుకున్నారు పూరీ టీం. ఇప్పటికే హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ వో .. సినిమాలు చేసిన ఈ బ్యూటీ హీరోయిన్ గా మంచి మార్కులే పడ్డాయి. అందం అభినయం లో నాట్ బ్యాడ్ అని అనిపించుకుంది. దాంతో పూరి అనన్య పాండే హీరోయిన్ గా తన సినిమాకి ఎంచుకున్నారు. ఈ బ్యూటి దేవరకొండ సినిమాతో తెలుగులో డెబ్యూ హీరోయిన్ గా మరిచయమవుతోంది. వాస్తవంగా ఈ సినిమాలో ముందు నిధి అగర్వాల్, జాన్వీ కపూర్ నటిస్తుందన్న రూమర్స్ వచ్చాయి. కానీ చివరికి ఛాన్స్ అనన్య కి దక్కింది.

అలాగే అనన్యకు పోటీగా మరో బాలీవుడ్ సెలబ్రిటీ కూతురు కూడా టాలీవుడ్ లో ఎంటరవుతోంది. తనే సయీ మంజ్రేకర్. బాలీవుడ్ నటుడు, దర్శకుడు సక్సస్ ఫుల్ తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి ఫేమస్ అయిన మహేష్ మంజ్రేకర్ కూతురే సయీ మంజ్రేకర్. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఇటు సయీ మంజ్రేకర్ కైనా, అటు అనన్య పాండేకైనా గ్లామర్ విషయంలో బాగానే ఆకట్టుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు గనక టాలీవుడ్ లో సక్సస్ అయితే ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందన్న లకి చెక్ పెడుతున్నట్టే.

Read more RELATED
Recommended to you

Latest news