అక్కడా ఇక్కడా కాదు .. SIT సోదా ఏకంగా ఆ ప్రాంతం లో మొదలెట్టింది .. ఒక్కొక్కడూ ఢమాల్  !

-

చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని కోసం జరిగిన భూసేకరణలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైయస్ జగన్ గవర్నమెంట్ ఆరోపించడం జరిగింది. ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి పై ఒక ప్రత్యేకమైన 10 మంది సభ్యులతో కూడిన SIT ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ బృందం అక్కడ ఇక్కడ కాకుండా ఏకంగా అమరావతి ప్రాంతంలోనే దాడులు స్టార్ట్ చేయడంతో ఒక్కొక్కడికి గుండెల్లో ఢమాల్ అన్నట్లు బాంబు పేలినట్లు అయినట్లు వార్తలు వస్తున్నాయి. sit investigation on insider trading, SIT on insider trading: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ యాక్షన్ షురూ

తెలుగుదేశం పార్టీ హయాంలో కంచికచర్ల కీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి చేపట్టిన లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు …లక్ష్మీనారాయణ సమక్షంలోనే ఇంటిలో తనిఖీలు చేస్తూ దాడులు చేయడం ప్రారంభించారు. దీంతో అమరావతి ప్రాంతంలో ఎవరు అయితే తెల్ల రేషన్ కార్డులు కలిగి భూములు కొనుగోలు చేయడం జరిగిందో వారందరూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

వాస్తవంగా లక్ష్మీనారాయణ కూడా శుక్రవారం పరారీలో ఉన్నారు. మేటర్ లోకి వెళితే శుక్రవారం సిట్ అధికారులు లక్ష్మినారాయణ ఇంటికి చేరుకోవడం జరిగింది. స్థానిక ముందు లక్ష్మీనారాయణ కుమారుడు ఇంటికి వెళ్లటంతో సమాచారం లక్ష్మీనారాయణకు చేరటంతో శుక్రవారం లక్ష్మీనారాయణ కనబడలేదు. అయితే శనివారం సిట్ అధికారులు తిరిగి రాగా లక్ష్మీనారాయణ ఉండటం జరిగింది. అయితే తనకి శుక్రవారం ఒంట్లో బాగోక పోవడం వల్ల ఆస్పత్రికి వెళ్లినట్లు సిట్ అధికారులకు లక్ష్మీనారాయణ తెలిపారు.  

Read more RELATED
Recommended to you

Latest news