టైం చూసి కొడుతున్న పూరి.. జనగణమన డైలాగ్ లీక్..!

-

ఒకప్పుడు తనతో సినిమా అంటే స్టార్ హీరోలు కూడా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూసేవారు.. కాని వరుస ఫ్లాపులతో అతన్ని పక్కన పెట్టారు. ప్రస్తుతం స్టార్స్ అతనితో సినిమా అంటే దూరం జరుగుతున్నారు. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరి జగన్నాథ్ పరిస్థితి ఇది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్న పూరి మహేష్ తో పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత బిజినెస్ మేన్ సినిమా కూడా బాగా ఆడింది.

మహేష్ కోసం పూరి జనగణమన సినిమా కథ రాసుకున్నాడు. కథ మహేష్ కు వినిపించాడు. అయితే ప్రస్తుతం అసలేమాత్రం ఫాంలో లేని పూరితో సాహసం చేయాలని అనుకోని మహేష్ పూరిని పక్కన పెట్టాడు. అయితే తన సబ్జెక్ట్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో శాంపిల్ చూపిస్తూ జనగణమన నుండి ఓ డైలాగ్ వదిలాడు పూరి. పూరి తన ట్విట్టర్ లో డైలాగ్ రివీల్ చేశాడు. అంతే ఒక్కసారిగా అది వైరల్ అయ్యింది.

ఇంతకీ పూరి ఏం డైలాగ్ రాశాడు అంటే.. అని డైలాగ్ చూస్తుంటే కంటెంట్ లో మంచి దమ్ము ఉందని తెలుస్తుంది. పూరి కోరికను మన్నించి మహేష్ అతనితో సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం పువామా దాడి.. వాయుసేన సర్జికల్ స్ట్రైక్ ఇలా దేశం మొత్తం హాట్ హాట్ గా ఉన్న ఇలాంటి టైంలో మన దేశం గురించి చెబుతూ పూరి వదిలిన డైలాగ్ ఇంప్రెస్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news