అల్లు అర్జున్ కోసమే “పుష్ప” కథ రాశా … సుకుమార్ ..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. సక్సస్ ఫుల్ చిత్రాలని అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘ఆర్య’.. ‘ఆర్య2’ తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతుంది.

 

శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమా కథ మి తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ రాయలసీమ యాసలో మాట్లాడతాడని తెలుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ కంప్లీట్ మాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. రంగస్థలం సినిమా టైం లో రాం చరణ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో అదే రెస్పాన్స్ ఇప్పుడు పుష్ప పోస్టర్ లో అల్లు అర్జున్ లుక్ చుస్తే వస్తోంది. ఇక ఈ సినిమాని తెలుగు-హిందీ-తమిళం- మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఇక రంగస్థలం తో సుకుమార్ అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ సక్సస్ లని అందుకొని ఉండటం తో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు అల్లు అర్జున్-సుకుమర్-దేవీ శ్రీప్రసాద్ కలిసి మళ్ళీ మ్యాజిక్ చేయబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సుకుమార్ ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారని తెలుస్తుంది. అదేమిటంటే పుష్ప కథ కేవలం అల్లు అర్జున్ కోసమే రాసినట్టు తెలిపారట. ఆర్య ఆర్య 2 తో క్లాస్ గా చూపించాను. పుష్ప సినిమాలో అందుకు భిన్నంగా చూపించడానికే ఈ కథ రెడి చేశానని అన్నారట. దీన్ని బట్టి చూస్తే ఈ ఇద్దరి కాంబినేషన్ లో బ్యాట్రిక్ హిట్ మాత్రమే కాదు బ్లాక్ బస్టర్ రాబోతుందని అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news