పెళ్లికి సిద్ధమైన రకుల్.. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇదే హాట్ టాపిక్..!

-

ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రేమ జంటలు ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది ప్రేమ పక్షుల్లా కొన్ని సంవత్సరాలు విహరించిన ఆలియా, రణబీర్ కపూర్ వివాహం చేసుకొని గత ఏడాది కొత్త జీవితంలోకి అడుగుపెట్టడమే కాకుండా వివాహం జరిగిన ఎనిమిది నెలలకే పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఆలియా.. ఇక ఆ తరువాత అంతే స్థాయిలో ప్రేమ పక్షుల్లా విహరించిన కియారా అద్వాని, సిద్ధార్థ మల్హోత్రా కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. అయితే వీరు ప్రేమలో ఉన్నట్టు ఏ రోజు కూడా ఎక్కడ చెప్పలేదు. కానీ రహస్యంగా ప్రేమించుకొని ఎట్టకేలకు పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఈ జంట..

ఇప్పుడు బాలీవుడ్ లో సిద్ధంగా ఉన్న మరొక ప్రేమ జంట రకుల్ ప్రీతిసింగ్, జాకీ భగ్నాని అని చెప్పవచ్చు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో అధికారికంగా స్పష్టం చేశారు.. మొత్తానికైతే నెక్స్ట్ త్వరలో వీరి పెళ్లి జరగబోతోంది అనే వార్త బీ టౌన్ లోనే కాదు అటు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఫిట్నెస్ యాక్టివిటీతో అదే బిజినెస్ తో కాస్త బిజీగా ఉండే రకుల్ తాజాగా టాలీవుడ్ లో తనపై బజ్ క్రియేట్ చేసుకోవడం మానేశారు. బాలీవుడ్లో తన ప్రియుడు జాకీతో చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా తన పెళ్లి రూమర్ తో టాప్ ట్రెండింగ్ బ్యూటీ గా మారిపోయింది. తర్వాత బాలీవుడ్ లో జరిగే బిగ్ మ్యారేజ్ రకుల్ దే అనే టాక్ వచ్చేలా చేసుకుంటుంది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానినీ త్వరలో పెళ్లి చేసుకోవాలని ఆమె అభిమానులు, తన స్నేహితులు ,కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు టాలీవుడ్ నుంచి ఇటు బాలీవుడ్ వరకు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news