సైరా రిలీజ్ సీక్రెట్ చెప్పేశాడు

-

మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో చేస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఇన్నాళ్లు 150 నుండి 200 కోట్ల బడ్జెట్ మాత్రమే ఈ సినిమాకు పెట్టారని భావిస్తుండగా లేటెస్ట్ గా చరణ్ సినిమా బడ్జెట్ 250 కోట్లు అంటూ షాక్ ఇచ్చాడు.

చిరంజీవికి ఆ సినిమాను కానుకగా ఇవ్వాలని చిరు సతీమణి సురేఖ అనుకున్నారట. అందుకే చిరు కోరిక తీర్చేందుకు బడ్జెట్ విషయంలో రాజీ పడట్లేదని చెబుతున్నాడు చరణ్. పిరియాడికల్ సబ్జెక్ట్ తో వస్తున్న సినిమా కాబట్టి సినిమా షెడ్యూల్ కాస్త అటు ఇటు అవుతుందని అంటున్నాడు చరణ్. అంతేకాదు ఈ సినిమాను దసరాకి రిలీజ్ అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చాడు. సో దసరా రేసులో సైరా ఖర్చీఫ్ వేశాడన్నమాట.

చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా సంక్రాంతి కానుకగా 11న రిలీజ్ అవుతుంది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఈ సినిమా తర్వాత రాం చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version