రజినీకాంత్ సినిమా లో మరోసారి విలన్ గా రమ్యకృష్ణ

-

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ విలన్ గా నటించబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.రజినీకాంత్- రమ్యకృష్ణ కాంబినేషన్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే సినిమా ‘నరసింహా’ ఈ చిత్రంలో నీలాంబరి గా రమ్యకృష్ణ కనబరిచిన అభినయం ప్రేక్షకుల్ని ఫిదా చేసింది.ఈ పాత్రను రమ్యకృష్ణ అద్భుతంగా చేశారని రజినీకాంత్ సైతం పలు సందర్భాలలో మెచ్చుకున్నారు.అయితే ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ కానుంది అని తెలుస్తుంది.రజిని తన తర్వాత సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు.ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కు ఫైనల్ టచ్ ఇవ్వడంతో పాటు నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియలో నెల్సన్ ఉన్నారట. ఐశ్వర్యారాయ్, ప్రియాంకా అరుల్ మోహన్ కీలకపాత్రల్లో విలన్ గా రమ్యకృష్ణ ను తీసుకోవాలని యోచిస్తున్నారని తెలిసింది.ఇప్పటికే రమ్యకృష్ణను కూడా సంప్రదించారట.కథ నచ్చి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల టాక్.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.దీంతో ఈ చిత్రంపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news