ఎట్టకేలకు ‘రంగ మార్తాండ’ అప్‌డేట్..డైరెక్టర్ కృష్ణవంశీ ట్వీట్

-

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ ఫిల్మ్ కోసం సినీ అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎట్టకేలకు చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు. ‘నక్షత్రం’ పిక్చర్ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత వస్తోన్న పిక్చర్ ఇది. మరాఠీ హిట్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ ఈ పిక్చర్. కాగా, ఈ సినిమాపైన భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ చిత్రంలో కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, ‘బిగ్ బాస్’ ఫేమ్ అలి రెజా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందంలు నటించారు. గాన గాంధర్వుడు ఇళయరాజా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, తాజాగా ‘రంగ మార్తాండ’ చిత్ర లోగోను ఫైనల్ చేసినట్లు ట్వీట్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ.

చాలా చక్కగా ‘రంగ మార్తాండ’ చిత్ర లోగోను ధని ఏలే డిజైన్ చేసినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు డైరెక్టర్ కృష్ణవంశీ. త్వరలో ఆ లోగో అందరికీ చూపిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా సినిమా విడుదలకు సన్నాహకాలు జరుగుతున్నాయన్న సంగతిని ఈ ట్వీట్ తో స్పష్టం చేశాడు డైరెక్టర్.

Read more RELATED
Recommended to you

Latest news