ఎన్టీఆర్‌కు రాశీఖ‌న్నా షాక్ మామూలుగా లేదుగా…

-

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి హీరోలు తెరమీద డాన్సు చేస్తుంటే ప్రేక్షకులు ఎంతో మైమరచిపోతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాల్లో పాటలు వచ్చాయంటే వాళ్ల స్టెప్‌లు చూస్తూ అభిమానులు చేసే రచ్చ అంత ఇంత కాదు. డ్యాన్స్ విషయంలో ఈ ఇద్దరు హీరోలు ఎవరికి వారే సాటి అన్నట్టుగా ఉంటారు.. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్‌కు రాశీఖన్నా షాక్ ఇచ్చిందట.. వీరిద్దరూ కలిసి జై లవకుశ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాలో ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా రాశీఖన్నా ఏంటి అన్ని మూమెంట్స్ ఎన్టీఆర్‌కే ఇస్తున్నారు… ఎన్టీఆర్‌కు ఇచ్చే మూమెంట్స్ నాకు కూడా ఇవ్వండి.. అని డ్యాన్స్ మాస్టర్‌ను డిమాండ్ చేయడంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు అంట. ప్రస్తుతం రాశీ, సాయి ధరమ్ తేజ్ తో ప్రతి రోజు పండుగ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమె జై లవకుశ సినిమాలో సాంగ్ షూటింగ్ జరుగుతున్న టైంలో జరిగిన ఆ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టింది.

డ్యాన్స్ మాస్టర్లు ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మూమెంట్స్ ను తాను కూడా చేస్తా అని పట్టుబట్టి మరి చేయడంతో ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు సైతం షాక్ అయినట్టు ఆమె చెప్పింది. ఇక డ్యాన్స్ వియంలోనే కాదు యాక్టింగ్,డైలాగ్స్  తన పాత్ర తగ్గిందని అనిపిస్తే వెంటనే వెళ్లి డైరెక్టర్ ని అడుగుతాను అని చెప్పింది.

ఇక సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా  కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సుప్రీం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో బెల్లం శ్రీదేవి అనే లేడీ ఎస్ఐ గా అద్భుతంగా నటించి ప్రశంసలు కొట్టేసింది.. ఇక ఇప్పుడు ప్రతి రోజు పండగ సినిమాలో ఏంజెలినా పాత్రలో ఆమె సరిగ్గా సరిపోతుందని తానే రికమెండ్ చేశా అని సాయి చెప్పాడు.. ఈ సినిమా డిసెంబర్ 20 న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news