వీళ్లే రాక్షసులు అంటూ భయానక వీడియో షేర్ చేసిన రష్మీ..!

-

ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన వాక్చాతుర్యంతో అందచందాలతో యువతను ఆకట్టుకునే ఈమె అటు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సమాజంలో జరిగే చిన్న చిన్న విషయాలపై కూడా స్పందించే ఈమె జంతువులపై ఏదైనా జరగరానిది జరిగిందంటే మాత్రం వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటుంది. ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మి నెటిజన్స్ తో టచ్ లోకి వస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఒక దారుణమైన వీడియోను షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేసింది.

సహజంగా రష్మీ యానిమల్ లవర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మూగజీవాలకు ఏ చిన్న అపాయం జరిగినా సరే ఆమె ఆవేదన చెందుతూ సదరు ఘటనలను ఖండిస్తూ ఉంటుంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు వార్తల్లో నిలిచి ఒక మంచి మనసున్న అమ్మాయిగా ప్రత్యేక అభిమాన వర్గాన్ని పోగుచేసుకుంది. జంతు ప్రేమికురాలిగా ఆవులు, గేదెలు, కుక్కలు, కోళ్ళు ఇలా మూగజీవాల సంరక్షణకు పాటుపడుతూ ఉండే రష్మీ జీవహింస పాపం అంటూ జనంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.

తాజాగా ఒక భయంకరమైన వీడియోని పంచుకుంది.. రాక్షసులు ఎక్కడో లేరు మన చుట్టూనే ఉన్నారు అంటూ ఎమోషనల్ అయింది. ఒకసారి తీరంలో పదుల సంఖ్యలో తిమింగలాలను సంహరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి తిమింగలాలను అలా చంపుతున్న వ్యక్తులను రాక్షసులుగా పరిగణించింది. సాగర తీరం మొత్తం ఎర్రగా మారిపోవడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఏదేమైనా రష్మి షేర్ చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరిని భయాందోళనలతో పాటు మరింత బాధకి గురిచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news