జగన్ కు అమిత్ షా ప్రాణ వాయువును ఇస్తున్నారు – చింతా మోహన్

-

జగన్ కు అమిత్ షా ప్రాణ వాయువును ఇస్తున్నారని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. మోడీ మాటలు, చేతలు అంతా బూటకమేనని.. 9 ఏళ్ల పాలనలో బీజేపీ దేశానికి చేసింది శూన్యం అని ఫైర్‌ అయ్యారు. కర్ణాటకలో వచ్చిన ఫలితాలు దేశ ప్రజల నాడికి నిదర్శనమని.. ఏపీలో బీజేపీకి పునాదులు పడవని చురకలు అంటించారు.

జగన్ నాలుగేళ్లలో హత్యలు, ఆత్మహత్యలు, జైళ్లు, బెయిల్లలో అభివృద్ది సాధించారని… బీజేపీ – వైసీపీలు రెండూ ఒకటే అంటూ వ్యాఖ్యనించారు. జగన్ కు ప్రాణ వాయువును ఢిల్లీలో అమిత్ షా ఇస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ చింతా మోహన్. చంద్రబాబు ఒక తొందర బాబు అని… వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీ చేతిలో తోలు బొమ్మలు అంటూ విమర్శలు చేశారు. టీడీపీ, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని…. వచ్చే ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలు ఏపీలో వస్తాయని స్పష్టం చేశారు కాంగ్రెస్‌ మాజీ ఎంపీ చింతా మోహన్. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండున్నర ఏళ్ల కాపులకు మిగతా కాలం బీసీ లేదా ఎస్సీలకు సీఎం పదవి ఇవ్వాలని నా ఆలోచన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news