కాబోయే భ‌ర్త అర్హ‌త‌ల గురించి మ‌న‌సు విప్పిన ర‌ష్మిక మంద‌న్నా

-

నేషన‌ల్ క్ర‌ష్ గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్నా.. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీ గా ఉంటుంది. పుష్ప పార్ట్ వ‌న్ విజ‌యం సాధించిన‌త త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్నా.. ఆడ‌వాళ్లు మీకు జోహ‌ర్లు అనే సినిమాలో న‌టించింది. శ‌ర్వ‌నంద్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ 25కు విడుద‌ల చేయ‌డానికి సిద్ధం అయింది. కాగ ఈ సినిమా ప్ర‌మేషన్స్ లో భాగంగా బుధ‌వారం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా నేషన‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా.. త‌న కాబోయే భ‌ర్త‌కు కావాల్సిన అర్భ‌త‌ల గురించి తో పాటు ల‌వ్ మ్యారేజ్ గురించి కూడా మ‌న‌సు విప్పి చెప్పింది.

ఎవ‌రి ద‌గ్గ‌ర అయితే.. సెక్యూర్ గా, కంఫ‌ర్ట్ గా ఫీల్ అవుతామో వారే త‌న భ‌ర్త అవుతాడ‌ని అన్నారు. అలాగే ఎలాంటి విషయాలు అయినా.. అత‌ని పంచుకునేలా ఉండేవ వ్య‌క్తి త‌న‌కు మొగుడు అవుతాడ‌ని ప్ర‌క‌టించింది. అలాగే ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఒక‌రినొక‌రు స‌మానంగా అర్థం చేసుకుంటేనే ల‌వ్ అంటార‌ని అన్నారు. తాను ఎవ‌రినైనా ల‌వ్ చేస్తే.. ఇంట్లో వారిని ఒప్పించిన త‌ర్వాతే మ్యారేజ్ చేసుకుంటాన‌ని తెలిపింది.

అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ తో ర‌ష్మిక మంద‌న్నా.. ల‌వ్ లో ఉన్న‌ట్టు గ‌త కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ప్ర‌చారం అవుతున్న విషయం తెలిసిందే. కాగ దీనిపై ర‌ష్మిక స్పందించింది. విజ‌య్ త‌న‌కు మంచి స్నేహితుడు మాత్ర‌మే అని చెప్పింది. దీంతో ఈ ప్ర‌చారానికి తెర ప‌డే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news